Breaking News

హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు


Published on: 11 Jul 2025 12:14  IST

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మెుత్తం బాధితుల సంఖ్య 51కి కాగా.. గాంధీ ఆస్పత్రిలో 14మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అలాగే నిమ్స్‌లో 34 మంది కల్తీ కల్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. నిమ్స్‌లో ఆరుగురికి వైద్యులు డయాలసిస్‌ చేస్తున్నారు. ఈఎస్ఐలో ఒకరు, ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరొకరికి చికిత్స కొనసాగుతోంది. కాగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గంగారాం(70) అనే వ్యక్తి తాజాగా మృతిచెందారు. దీంతో మెుత్తం మృతుల సంఖ్య తొమ్మిది మందికి చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి