Breaking News

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!


Published on: 14 Jul 2025 11:41  IST

వెండితెరను ఏలిన అలనాటి నటీమణి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో 200 సినిమాలకుపైగా సరోజాదేవి నటించి మెప్పించారు. 1938 జనవరి 7న సరోజాదేవి జన్మించారు. సరోజా దేవి 1955లో ‘మహాకవి కాళిదాస’ చిత్రం ద్వారా నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ సమయంలో ఆమెకు 17 సంవత్సరాలు. పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు సరోజాదేవిని వరించాయి.

Follow us on , &

ఇవీ చదవండి