Breaking News

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం


Published on: 14 Jul 2025 12:46  IST

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా‌లను కేంద్రం నియమించింది. విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి