Breaking News

రైతన్నల కోసం పోరాడుతాం: కేటీఆర్


Published on: 14 Jul 2025 14:08  IST

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా చేసిన సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయని మండిపడ్డారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండగ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో వచ్చిన నీళ్లు.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు రావడం లేదని రైతులే ప్రశ్నిస్తున్నారన్నారు. రైతులకు కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి