Breaking News

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!


Published on: 15 Jul 2025 16:14  IST

రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అయితే, ఈరోజు ఆ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకున్న ధర్మాసనం.. మద్యం కుంభకోణం విచారణ కీలక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో త్వరలో ఈ కేసులో మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి