Breaking News

రోడ్డు ప్రమాదంలో గుదిబండి వెంకటరెడ్డి మృతి


Published on: 22 Jul 2025 14:45  IST

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి, జీవీఆర్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గుదిబండి వెంకటరెడ్డి (84) మృతిచెందారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం జీవీఆర్‌ ఆరాధన సంస్థను స్థాపించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున బస్సు ప్రమాదంలో వెంకట్‌రెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు.

Follow us on , &

ఇవీ చదవండి