Breaking News

ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చ..


Published on: 23 Jul 2025 14:24  IST

'ఆపరేషన్ సిందూర్' పై ఈనెల 29న పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. 16 గంటల సేపు చర్చ జరిపేందుకు పార్లమెంట్ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కీలకమైన 'ఆపరేషన్ సిందూర్‌' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలను, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి