Breaking News

మంత్రులవి అర్థంలేని సమాధానాలు..


Published on: 18 Sep 2025 14:56  IST

ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకు చాలా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు వచ్చాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చాలా నిర్లక్ష్యంగా మంత్రుల సమాధానాలు ఉన్నాయని.. మంత్రులంతా అదే తీరు అంటూ మండిపడ్డారు. 50 ఏళ్లకే ఫించన్ అన్నారని.. అదే అడిగితే దానికి సమాధానం లేదన్నారు. ఒక ప్రశ్న అడిగితే ఏవేవో సమాధానాలు చెప్తున్నారని బొత్స మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి