Breaking News

ఆ కలెక్టర్‌పై ప్రభుత్వం సీరియస్..


Published on: 18 Sep 2025 15:05  IST

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. నిన్న(బుధవారం) ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. జెండా ఆవిష్కరణ సమయానికి హాజరు కాకపోవడంతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలకడంలో కలెక్టర్ నిర్లక్ష్యం వహించారు.ఈ సంఘటనకు సంబంధించి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.

Follow us on , &

ఇవీ చదవండి