Breaking News

బీ అలర్ట్.. రెండు గంటల్లో భారీ వర్షం.!


Published on: 25 Sep 2025 15:24  IST

నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అయితే, మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మెహదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్, మాసబ్‌ ట్యాంక్, నాంపల్లి, లకిడికాపూల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అలాగే ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి