Breaking News

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ..


Published on: 29 Sep 2025 12:06  IST

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్ ఇవాళ(సోమవారం) విచారణ జరుపనున్నారు. ఈరోజు విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు ప్రతివాదుల లాయర్లు. సంజయ్‌, చింతా ప్రభాకర్‌ను క్రాస్‌ ఎగ్జిమినేషన్‌ చేయనున్నారు ప్రతివాదుల లాయర్లు. ఈరోజు నుంచి అక్టోబర్‌ 6వ తేదీ వరకు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు ఉండనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి