Breaking News

కేబినెట్ భేటీకి సన్నద్ధం..


Published on: 09 Oct 2025 17:30  IST

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రేప‌టి కేబినెట్‌ సమావేశంలో రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది.

Follow us on , &

ఇవీ చదవండి