Breaking News

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ.?


Published on: 10 Oct 2025 12:00  IST

ఏపీ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి ముందు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో భేటీ అయ్యింది. రుషికొండ ప్యాలెస్‌‌ను ఎలా వినియోగించాలి అన్న దానిపై చర్చించారు. రుషికొండను ప్రజాప్రయోజనకర వినియోగానికి సబ్‌ కమిటీ సిఫార్సులు చేసింది. గతంలో రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది.

Follow us on , &

ఇవీ చదవండి