Breaking News

ప్రజలు తిరగబడతారనే తెరపైకి రిజర్వేషన్ల అంశం


Published on: 10 Oct 2025 15:15  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకార్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మోసకారి అంటూ వ్యాఖ్యలు చేశారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని... ఇంటింటికీ గ్యారంటీ కార్డులిచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. అబద్ధాలను కూడా నిజం చేసే మాటకారి రేవంత్ రెడ్డి అంటూ కామెంట్స్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి