Breaking News

గిరిజ‌న యువ‌కుడిపై దాడి..


Published on: 10 Oct 2025 15:42  IST

గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల‌ని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత నెల నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే గిరిజన యువకుడు యూరియా కోసం ధర్నాలో పాల్గొన్నాడు. ఈ కారణంతో వాడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్స్ చట్ట వ్యతిరేకంగా అతన్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కులం పేరిట దూషించారు కొట్టి అక్రమ కేసులు బనాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి