Breaking News

బాలానగర్‌లో దారుణం..


Published on: 14 Oct 2025 11:28  IST

బాలానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుండి దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రెండు సంవత్సరాల కవలపిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిను తల్లి చల్లారి సాయిలక్ష్మీ(27) హతమార్చింది. అనంతరం తాను బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి