Breaking News

71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల


Published on: 14 Oct 2025 15:36  IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. భారతీయ జనాతా పార్టీ 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పేర్లు చోటుచేసుకున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా 101 స్థానాల్లో బీజేపీ ఈసారి పోటీ చేస్తోంది.తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి