Breaking News

రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం: హోంమంత్రి అనిత


Published on: 14 Oct 2025 16:32  IST

గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం శుభ పరిణామమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో ఉత్తరాంధ్ర ప్రపంచ పటంలో నిలవనుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో 1.88 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గతంలో సీఎం చద్రబాబు హైదరాబాద్‍లో హైటెక్ సిటీ అభివృద్ధి చేశారని.. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‍గా తీర్చిదిద్దబోతున్నారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి