Breaking News

యాప్‌తో మద్యం గుట్టు పట్టేయొచ్చు..


Published on: 16 Oct 2025 15:54  IST

ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌ ద్వారా మద్యం కల్తీదా, నాణ్యమైనదా అన్న విషయం తెలుసుకోవచ్చని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఆయన గురువారం తనిఖీ చేశారు. సిబ్బందితో సమీక్షించారు. అనంతరం పట్టణంలోని మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. కొనుగోలుదారులకు యాప్‌ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డి, ఏఈఎస్‌ శ్రీరామ్‌, ఎక్సైజ్‌ సీఐ రవిచంద్ర, ఎస్‌ఐ వీరస్వామి పోతులయ్య పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి