Breaking News

నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ..


Published on: 17 Oct 2025 14:11  IST

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ మొదలైంది. మద్యం కేసులో పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి తంబళ్ల పల్లె కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి మేరకు ఈరోజు (శుక్రవారం) ఉదయం మదనపల్లి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి