Breaking News

పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్


Published on: 17 Oct 2025 14:35  IST

కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి అని.. రాష్ట్రంలో 45లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోందని తెలిపారు. 22 లక్షలకు పైగా రైతులు పత్తిని పండిస్తున్నారన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి