Breaking News

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ!


Published on: 17 Oct 2025 16:25  IST

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్‌టైమ్ రికార్డ్ ఊరిస్తోంది. ఆదివారం(అక్టోబర్ 19) నుంచి ఆసీస్ తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ సెంచరీ సాధిస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే ఈ రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ.. అధిగమించేందుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో పడనుంది.

Follow us on , &

ఇవీ చదవండి