Breaking News

పాక్‌లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లో ఉంది.


Published on: 18 Oct 2025 16:57  IST

దాయాది దేశం పాకిస్థాన్‌ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల రేంజ్‌లోనే ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ యూనిట్‌ను ఆయన శనివారం నాడు సందర్శించారు. ఇక్కడ తొలివిడత తయారైన బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి ఆయన అప్పగించారు.బహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని, దేశంలో పెరుగుతున్న స్వదేశీ సాంకేతికత, సామర్థ్యాలకు నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి