Breaking News

డీప్‌ఫేక్‌ ముప్పుపై ఉడాయ్‌ ‘సిటా’ అస్త్రం..!


Published on: 18 Oct 2025 17:17  IST

డీప్‌ఫేక్‌ సాంకేతికత దుర్వినియోగం అవుతోంది. ఈ అధునాతన టెక్నాలజీ సాయంతో సైబర్‌ నేరగాళ్లు అమాయకుల నుంచి పెద్దఎత్తున సొమ్ము కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ (UIDAI) అప్రమత్తం అయ్యింది. దేశ డిజిటల్‌ గుర్తింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి నడుం బిగించింది. ఇందుకోసం స్కీమ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ విత్‌ ఆధార్‌ (SITAA) పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి