Breaking News

దివాళీ గిఫ్ట్‌గా.. చికెన్‌ మసాలా ప్యాకెట్‌


Published on: 18 Oct 2025 17:39  IST

మహారాష్ట్ర లోని ఓ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు అసాధారణమైన దీపావళి బహుమతిని అందుకున్నారు. పంధర్‌పూర్‌లోని ప్రఖ్యాత విఠల్‌ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు అధికారులు దివాళీ గిఫ్ట్‌గా చికెన్‌ మసాలా ప్యాకెట్లను అందించారు. సెక్యూరిటీ గార్డ్స్‌, ఇతర ఉద్యోగులతో సహా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వీటిని అందించారు. అయితే, ఆలయ ఉద్యోగులకు చికెన్‌ మసాలా ప్యాకెట్లు ఇవ్వడం స్థానికంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి