Breaking News

అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు..


Published on: 19 Oct 2025 11:51  IST

దీపావళి పర్వదినం సమస్త సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఒక ముఖ్యమైన పండుగ. దీపాలు వెలిగించి జ్ఞాన మార్గంలో నడవాలని దీపావళి పండుగలోని అంతరార్ధం. దీపపు వెలుగు చీకటిని పాలద్రోలుతుంది. చీకటిలో ఉన్నప్పుడు పాము ఏదో కర్ర ఏదో తెలియదు. చీకటిలో అది కాలికి తట్టినప్పడు ఎంతో భయపడుతాం. ఒక్కసారి కాంతిని వెలిగించి చూసి అది కర్ర అని తెలుసుకుంటే భయం పోతుంది. మనలో ఉండే అజ్ఞానాన్ని పాలద్రోలి జ్ఞానం అనే వెలుగులని మన జీవితాల్లోకి ఆహ్వానించాలనేదే దీపావళి పండగ సారాంశం.

Follow us on , &

ఇవీ చదవండి