Breaking News

భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు...


Published on: 20 Oct 2025 12:38  IST

దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా.. భారతదేశం, విదేశాలలో నివసిస్తున్న భారతీయులందరికీ ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. 'దీపావళి భారతదేశం ప్రధాన, ప్రసిద్ధ పండుగ. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఇస్తుంది.' అని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి