Breaking News

మహాఘట్‌బంధన్‌కు దెబ్బమీద దెబ్బ


Published on: 22 Oct 2025 15:03  IST

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాఘట్‌బంధన్ కు మరో గట్టి దెబ్బ తగలింది. కైమూర్ మోహనియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఆర్జేడీ అభ్యర్థి శ్వేతా సుమన్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్‌ నివాసిగా పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్‌ను మంగళవారంనాడు ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి