Breaking News

మూడు గంటలపాటు గాలిలో ఎగిరి చివరకు..


Published on: 22 Oct 2025 15:43  IST

ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో విమానాన్ని వెనక్కి మళ్లించి.. సురక్షితంగా బయలుదేరిన ఎయిర్ పోర్టులోనే ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన తాజాగా ముంబైలో చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి 1.15 గంటలకు ముంబై ఎయిర్ పోర్టు నుంచి అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నగరానికి ఏఐ 191 విమానం ప్రయాణికులతో బయలుదేరింది. కొన్ని గంటల తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి