Breaking News

ఉక్కుపాదంతో అణచివేస్తాం..మంత్రి లోకేశ్..


Published on: 22 Oct 2025 16:44  IST

కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్‌కు గురయ్యానని తెలిపారు. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి