Breaking News

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటో మార్ఫింగ్‌పై ఫిర్యాదు


Published on: 23 Oct 2025 12:47  IST

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేసి, నకిలీ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్‌ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి విన్నవించారు. బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తులపై సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. బాధ్యులపై సీపీ సజ్జనార్‌.. కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి