Breaking News

పలు పోలీస్ స్టేషన్లలో విశాఖ డీఐజీ తనిఖీలు


Published on: 23 Oct 2025 14:25  IST

వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి తనిఖీలు చేశారు. పీఎస్ లలో కేసుల పురోగతి, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్షన్ చేసామని చెప్పారు. ప్రాపర్టీ అఫెన్సస్ ఎక్కువగా ఉన్నాయని.. వాటిలో పురోగతి ఆశించిన మేర లేదని చెప్పారు. పోక్సో చట్టాలపై విద్యా సంస్టల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మిగతా శాఖలతో కలిసి మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి