Breaking News

మాస్కోపై ట్రంప్‌ కఠిన చర్యలు..


Published on: 23 Oct 2025 15:06  IST

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ‘రష్యా చమురు’ను ట్రంప్‌ టార్గెట్‌ చేశారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఇప్పటికే అధిక టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.ఇక ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో పుతిన్‌ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌.. రష్యాపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.

Follow us on , &

ఇవీ చదవండి