Breaking News

రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు


Published on: 23 Oct 2025 17:17  IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ(గురువారం) దర్శించుకున్నారు. కవితకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలని ఉద్ఘాటించారు కవిత.

Follow us on , &

ఇవీ చదవండి