Breaking News

మా రాష్ట్రానికి రండి


Published on: 24 Oct 2025 11:03  IST

విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ వస్తున్న నేపథ్యంలో గ్రీన్‌ ఎనర్జీపై ఫోకస్‌ పెట్టామని, ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం ఆయన యూఏఈకి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పెట్టుబడి పెట్టాలని ప్రముఖ సంస్థ అపెక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చైర్మన్‌ ఖలీఫా కౌరీని కోరారు. బ్యాటరీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులపైనా చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి