Breaking News

100 కోట్ల ‘కుడా’ భూమి కబ్జాకు యత్నం!


Published on: 24 Oct 2025 14:28  IST

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకుండా భూముల అమ్మకంలో నిజమవుతున్నది. వరంగల్‌ మహానగరంలోని అతి ఖరీదైన స్థలాన్ని అడ్డగోలుగా దక్కించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేతలు రంగం సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు అధికారికంగా కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.నవంబర్‌ 3న బహిరంగ వేలం ఉంటుందని ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి