Breaking News

పాక్‌-అఫ్ఘాన్‌ బార్డర్‌ క్లోజ్‌..


Published on: 24 Oct 2025 14:42  IST

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్‌, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఘర్షణల తర్వాత పాకిస్థాన్‌లో టమాటా ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి