Breaking News

పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ భారత సైన్యం


Published on: 08 May 2025 16:26  IST

భారత్ ప్రతీకార దాడులతో పాకిస్థాన్ తీవ్రంగా బెంబేలెత్తుతోంది. భారత్ లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయాలని యత్నించిన పాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లాహోర్‌లోని గగనతల రక్షణ వ్యవస్థను భారత సైన్యం ధ్వంసం చేసింది. అంతేగాక, పాక్ దాడులను సమర్థంగా అడ్డుకున్న భారత్‌, దాని రాడార్ కేంద్రాలపై కూడా ప్రతిగా విరుచుకుపడింది. మరోవైపు, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ రాజౌరీ, పూంచ్ తదితర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 16 మంది పౌరులు మృతి చెందారు.

Follow us on , &

ఇవీ చదవండి