Breaking News

చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం


Published on: 02 Dec 2025 11:49  IST

దిత్వా’ తుఫాన్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. గంట కు సగటున ఐదారు కిలోమీటర్ల వేగంతో తమిళనాడు, పుదుచ్చేరికి అతి సమీపంగా పయనిస్తూ సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకి చేరువగా వచ్చింది. చెన్నైకి తూర్పున 50 కి.మీ దూరంలో కొనసాగుతోంది. మరో రెండు రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడంలేదా, సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి