Breaking News

జగన్‌ హయాంలో.. రాష్ట్రానికి చెడ్డపేరు


Published on: 05 Dec 2025 10:50  IST

జగన్‌ ప్రభుత్వ హయాంలో సింగపూర్‌ ప్రభుత్వ సంస్థలను తరిమేశారని.. దానివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాల్లేవన్న అపప్రథను ఇప్పుడు తొలగించుకున్నామని.. పారిశ్రామికవేత్తల విశ్వాసం పొందగలిగామని అన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి