Breaking News

బ్యాంకింగ్‌ సేవలన్నీ సజావుగానే..


Published on: 09 May 2025 21:48  IST

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ATMలు మూతపడతాయనే వదంతులకు బ్యాంకులు స్పందించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సహా అనేక బ్యాంకులు తమ ATMలు, CDMలు, ADWMలు, డిజిటల్‌ సేవలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రకటించాయి. వినియోగదారులు ధ్రువీకరించని సమాచారంపై ఆధారపడవద్దని సూచించారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకుల సైబర్‌ భద్రతపై సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

Follow us on , &

ఇవీ చదవండి