Breaking News

సోనియా, రాహుల్‌తో రేవంత్‌, ఎంపీల భేటీ


Published on: 11 Dec 2025 16:43  IST

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,కాంగ్రెస్‌  అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్‌,ప్రియాంకలను తెలంగాణ ముఖ్యనేతలు కలిశారు.దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి,మంత్రి వివేక్‌తో పాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలు వారితో భేటీ అయ్యారు.పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు,సంక్షేమ పథకాల అమలుపై సోనియా, రాహుల్‌, ప్రియాంకలకు సీఎం రేవంత్‌ వివరించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ సమిట్‌, పెట్టుబడుల వివరాలను సోనియాకు ఆయన వివరించినట్లు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి