Breaking News

నిరసనలతో దద్దరిల్లిన ఓయూ..


Published on: 11 Dec 2025 18:02  IST

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా వేలాదిమంది పోలీసులు లాఠీలతో మోహరించడంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మరోవైపు విద్యార్థుల నిరసన గొంతు నొక్కేందుకు అధికారులు వందలాది మంది మఫ్టీ పోలీసులను రంగంలోకి దింపారు. క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎం సభ మూడు సార్లు వాయిదా పడింది. తొలుత ఉదయం 9 గంటలకు సభ ఉంటుందని అని చెప్పిన అధికారులు, ఆ తర్వాత 11 గంటలకు వాయిదా పడ్డట్టు తెలిపారు.చివరికి మధ్యాహ్నం ఒంటిగంటకు మార్చారు.

Follow us on , &

ఇవీ చదవండి