Breaking News

అఖండ-2 టికెట్‌ ధరల పెంపు మెమో సస్పెండ్‌


Published on: 12 Dec 2025 11:54  IST

సినీహీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ-2 సినిమా టికెట్‌ ధరల పెంపు, గురువారం రాత్రి 8 గంటలకు టికెట్‌ ధర రూ.600 చొప్పున ప్రీమియర్‌ షో ప్రదర్శించడానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభు త్వం జారీచేసిన మెమోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పెంచిన రేట్ల ప్రకారం టికెట్‌లను విక్రయించరాదని స్పష్టం చేసింది. హైకోర్టు జారీచేసిన ఈ ఉత్తర్వుల సమాచారాన్ని మెమో జారీచేసిన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సంబంధిత నిర్మాణ సంస్థ, బుక్‌మై షో తదితరులకు తెలియజేయాలని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి