Breaking News

ముగిసిన భవానీ దీక్షా విరమణలు..


Published on: 15 Dec 2025 12:50  IST

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భవానీలు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు ఇవాళ(సోమవారం) ముగిశాయి. ఐదు రోజుల పాటు దుర్గమ్మను ఐదులక్షల మందికి పైగా భవానీలు దర్శించుకున్నారు. శని, ఆదివారాలు వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో దుర్గమ్మ సన్నిధికి భవానీలు, సామాన్య భక్తులు తరలివచ్చారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి