Breaking News

సీఎం ఆలోచనల నుంచి పుట్టిందే ఎడ్యు సిటీ


Published on: 16 Dec 2025 16:36  IST

విశాఖ ప్రపంచానికే కేంద్రంగా తయారవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ బాగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. మనదేశంలో ఏవియేషన్ అభివృద్ధి చెందుతుందంటే ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలిపారు. ప్రతి ఏటా 12 శాతం గ్రోత్ రేట్‌తో ఏవియేషన్ రంగం ఎదుగుతోందన్నారు. సాధారణ వ్యక్తి విమానంలో ప్రయాణం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని తెలిపారు. భవిష్యత్‌లో ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్య ఎనిమిది వేలకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి