Breaking News

సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సునీతారెడ్డి?


Published on: 17 Dec 2025 12:38  IST

ఏపీ మాజీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని వివేకా కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అన్ని అంశాలపై దర్యాప్తు చేయనీయకుండా ఒకటే అంశానికి పరిమితం కావాలని సీబీఐని కట్టడి చేసే అధికారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉందా? అని సునీతారెడ్డి తన అప్పీలులో ప్రశ్నించే అవకాశం ఉంది. దీనిపై ఆమె న్యాయవాదు లతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి