Breaking News

ప్రజా పాలన పైలట్ గ్రామంలో ఎగిరిన గులాబీ జెండా..!


Published on: 17 Dec 2025 17:00  IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్  సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. రెండో విడతలో ఈ నెల 14న నిర్వహించిన ఎన్నికల్లో రాళ్ళపేట సర్పంబ్‌గా బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలసాని పరుశరాములు గౌడ్ గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పైలట్ గ్రామంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వరుసగా రెండోసారి గెలుపొందడంతో సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి