Breaking News

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి


Published on: 17 Dec 2025 19:03  IST

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు హైదరాబాద్ కు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హకీంపేట, అల్వాల్, బొలారం, తిరుమలగిరి, కార్కానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్ కొనసాగుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి