Breaking News

మ్యాచ్‌ రద్దుపై అభిమానుల ఆగ్రహం


Published on: 18 Dec 2025 17:17  IST

టీమ్‌ ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య బుధవారం లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో టీ20 పొగమంచు కారణంగా టాస్‌ కూడా పడకుండా రద్దైన విషయం తెలిసిందే. సాయంత్రం నుంచి అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించారు. వారు చివరగా రాత్రి 9.25కు గ్రౌండ్‌ను తనిఖీ చేసి చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా మైదానం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఆ నగదు వెనక్కి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి